అతనికి ఉరే సరి!

August 08, 2019


img

దేశంలో నానాటికీ మహిళలపై ఆత్యాచారాలు పెరిగిపోతున్నాయి. ప్రవీణ్ వంటి కొందరు కామాంధులు పాలుత్రాగే పసిపిల్లలపై కూడా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. హన్మకొండలో రెడ్డి కాలనీలో సుమారు నెలన్నర క్రితం ప్రవీణ్ అనే కామాంధుడు, డాబా మీద తల్లి పక్కన నిద్రిస్తున్న చిన్నారిని ఎత్తుకువెళ్లి అత్యాచారం చేసి చంపేశాడు. స్థానికులు అతనిని పట్టుకొని దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసులు దర్యాప్తు జరిపి అతను దోషి అని నిరూపించే సాక్ష్యాధారాలను వరంగల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు సమర్పించడంతో, ఆ కేసును విచారిస్తున్న న్యాయమూర్తి కె.జయకుమార్ అతనికి ఉరి శిక్షను విధిస్తున్నట్లు తీర్పు చెప్పారు. పసిపాపపై అత్యాచారం, హత్య చేసిన ఆ కిరాతకుడికి ఉరి శిక్షే సరైనదని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు.  అత్యాచారం జరిగిన 48 రోజులలోనే కేసు దర్యాప్తు, న్యాయవిచారణ పూర్తిచేసి దోషికి ఉరిశిక్ష విధించడం ఇదే మొదటిసారి. హత్య, అత్యాచారం కేసులలో దేశంలో పోలీసులు, న్యాయస్థానాలు ఇంతవేగంగా స్పందిస్తే ఎవరూ ఇటువంటి ఆలోచనలు కూడా చేయడానికి సాహసించరు.     



Related Post