నేను బిజెపిలో చేరడం లేదు: కడియం

July 01, 2019


img

మాజీ ఉప ముఖ్యమంత్రి సీనియర్ తెరాస నేత కడియం శ్రీహరికి పార్టీలో, ప్రభుత్వంలో ప్రాధాన్యత తగ్గించడంతో ఆయన త్వరలో బిజెపిలో చేరబోతున్నారంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. వాటిపై ఆయన స్పందిస్తూ, “ఆ వార్తలలో నిజం లేదు. ఒక దళితనాయకుడి ఎదుగుదలను చూసి ఓర్వలేక వ్రాసిన రాతలు అవి. నేను ఎల్లప్పుడు నీతి, నిజాయితీ, సమర్ధత, నైతికవిలువలకు కట్టుబడే రాజకీయాలలో పనిచేస్తున్నాను తప్ప ఏనాడూ పదవులు, అధికారం కోసం ప్రాకులాడలేదు. ఇప్పుడు కూడా అంతే. పదవులు ఉన్నా లేకపోయినా ప్రజల కోసం పనిచేస్తూనే ఉంటాను. డాక్టర్ అంబేడ్కర్, వామపక్ష భావజాలం ప్రభావం నాపై చాలా ఎక్కువగా ఉంది. కనుక కులాలు, మతాలు, ప్రాంతాల ఆధారంగా రాజకీయాలు చేసే కాంగ్రెస్, బిజెపిలకు నేను ఎప్పుడూ దూరంగానే ఉంటాను. నా వంటి రాజకీయ నాయకులను ప్రోత్సహించవలసిన మీడియా నా గురించి ఏమీ తెలుసుకోకుండానే ఇష్టం వచ్చినట్లు వార్తలు ప్రచురించడం సరికాదు. ఇకనైనా ఇటువంటి పనులు మానుకోవాలని మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు.         



Related Post