హైదరాబాద్ నగరంలో ఆషాడ బోనాల ఉత్సవాలు ముగింపు దశకు చేరుకుంటున్నాయి. అది, సోమవారం రెండు రోజులలో లాల్ దర్వాజా బోనాలు, కార్వాన్లో దర్బార్ మైసమ్మ బోనాలు, అంబార పేట్ మహంకాళి బోనాలు, చిలకలగూదలోని కట్ట మైసమ్మ, పోచమ్మల బోనాలు జరుగబోతున్నాయి.
కనుక ఈ ప్రాంతాలలో రేపు, ఎల్లుండి ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ట్రాఫిక్ విభాగం ప్రజలకు తెలియజేసింది.
పాతబస్తీలోని మహంకాళి లాల్ దర్వాజా బోనాలు ఆగస్ట్ 9 ఉదయం 6 గంటల నుంచి ఊరేగింపు ముగిసే వరకు వాహనాలు వేరే మార్గాలకు మళ్ళిస్తారు. ఆగస్ట్ 10న ఉదయం ఉదయం 9 గంటల నుంచి ఊరేగింపు ముగిసే వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి.
ఈ ఆలయాల పరిసర ప్రాంతాలలో కొన్ని మార్గాలను పూర్తిగా మూసివేస్తారు. మరికొన్ని చోట్ల వాహనాలను ఇతర మార్గాలకు మళ్ళిస్తారు. కనుక నగర ప్రజలు ఈ రెండు రోజులు ట్రాఫిక్ ఆంక్షలను గుర్తుంచుకొని తమ గమ్యస్థానాలకు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా చేరుకోవాలని ట్రాఫిక్ పోలీస్ విభాగం సూచించింది.