కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కిషన్రెడ్డి నిన్న హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ, “దేశంలో ఎక్కడ ఉగ్రవాద దాడులు జరిగినా వాటికి మూలాలు మన హైదరాబాద్లోనే ఉంటున్నాయి. ఉగ్రవాదులకు హైదరాబాద్ సేఫ్ జోన్గా మారింది. ఇకపై రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నగరంలో ఉగ్రమూకలు తిష్టవేయకుండా గట్టి చర్యలు తీసుకొంటాము,” అని అన్నారు.
కిషన్రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ చాలా తీవ్రంగా స్పందించారు. “గత 5 ఏళ్లుగా నగరంలో ఒక్క ఉగ్రవాదదాడి జరుగలేదు. నగరంలో హిందూ,ముస్లింలు తమతమ పండుగలను చాలా ప్రశాంతంగా జరుపుకొంటున్నారు. హైదరాబాద్ నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది కూడా. అప్పుడప్పుడు ఎన్ఐఏ అధికారులు హైదరాబాద్లో సోదాలు చేస్తున్నప్పటికీ నగరంలో ఉగ్రవాదులు తలదాచుకొన్నారని వారు ఏనాడూ చెప్పలేదు. కానీ హైదరాబాద్ టెర్రరిస్ట్ హబ్బుగా మారిందని కిషన్రెడ్డి ఏవిధంగా చెపుతున్నారు? రాష్ట్రం... హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందడం కిషన్రెడ్డికి ఇష్టం లేదా? హైదరాబాద్ పట్ల కిషన్రెడ్డి ఎందుకు శతృత్వం పెంచుకొంటున్నారు? కేంద్రమంత్రిగా ఉన్న ఆయన ముస్లింలందరూ ఉగ్రవాదులేనన్నట్లు మాట్లాడటం సరికాదు,” అని అన్నారు.