బాధగానే ఉంది కానీ తప్పదు...పొంగులేటి

April 09, 2019


img

ఒక సిట్టింగ్ ఎంపీకి మళ్ళీ టికెట్ లభించకపోతే ఎంత బాధపడతారో తేలికగానే ఊహించుకోవచ్చు. పైగా వేరే పార్టీలో నుంచి హటాత్తుగా గోడ దూకి వచ్చి తన టికెట్ తన్నుకుపోయిన వ్యక్తికి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలంటే పుండు మీద కారం చల్లినట్లేననుకోవచ్చు. ఆ బాధ ఎలా ఉంటుందో తెలియాలంటే ఖమ్మం తెరాస సిట్టింగ్ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని అడగాలి. 

మంగళవారం కొత్తగూడెంలో ఆయన తన అనుచరులతో మాట్లాడుతూ, “ సిట్టింగ్ ఎంపీనైన నాకు టికెట్ కేటాయించకపోవడం చాలా బాధ కలిగించింది. కానీ పార్టీ పెద్ద అంటే కుటుంబం పెద్దగానే భావించాలి. ఆయన ఏమి చేసినా చాలా ఆలోచించే చేస్తారు. మన మంచికోసమే చేస్తారు. లోక్‌సభ ఎన్నికల తరువాత నాకు సముచిత స్థానం కల్పిస్తానని సిఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారు. కనుక నా స్థానంలో తెరాస అభ్యర్ధిగా పోటీ చేస్తున్న నామా నాగేశ్వరరావును గెలిపించుకొనేందుకు అందరం కష్టపడి పనిచేద్దాం,” అని అన్నారు. 



Related Post