కేసీఆర్‌ మాయలో పడొద్దు: మల్లు భట్టివిక్రమార్క

March 28, 2019


img

కాంగ్రెస్‌ శాసనసభాపక్ష నేత మల్లు భట్టివిక్రమార్క గురువారం జహీరాబాద్ పట్టణంలో ఎన్నికల ప్రచారంలొ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, “సిఎం కేసీఆర్‌కు ప్రజాస్వామ్యం, రాజ్యాంగం పట్ల ఏమాత్రం గౌరవం లేదు. అటువంటి వ్యక్తి 16 ఎంపీ సీట్లు ఇస్తే దేశాన్ని ఏలుతానని చెపుతున్నారు. అది ఏవిధంగా సాధ్యమో ఆయనే చెప్పాలి. 16 ఎంపీ సీట్లు గెలుచుకోవడానికే కేసీఆర్‌ ఈ మాయమాటలు చెపుతున్నారు. ఆ మాయలో చిక్కుకోవద్దని నేను ప్రజలకు చేస్తున్నాను. 16 ఎంపీలతో ఏదైనా సాధించడం సాధ్యమతే, గత 5 ఏళ్లుగా 15 ఎంపీలతో కేసీఆర్‌ ఎందుకు ఏమీ సాధించలేకపోయారు? ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ రాష్ట్రంలో ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసి నిరంకుశపాలన సాగించాలనుకొంటున్నారు. ఈ నిరంకుశపాలనకు అడ్డుకట్ట వేయాలంటే ప్రజలు కాంగ్రెస్ పార్టీకె ఓట్లు వేసి గెలిపించుకోవాలి. కేంద్రంలొ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే మళ్ళీ ప్రజాస్వామ్యం పునరుద్దరించబడుతుంది,” అని అన్నారు. 



Related Post