గుంటూరు జిల్లా తాడేపల్లిలో నిర్మించుకొన్న కొత్త ఇంట్లోకి వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డి దంపతులు ఈరోజు ఉదయం 8.19 గంటలకు గృహాప్రవేశం చేశారు. ఈ కార్యక్రమంలో జగన్ తల్లి విజయమ్మ, జగన్ సోదరి షర్మిల ఆమె భర్త అనీల్ కుమార్, వైసీపీ నేతలు పాల్గొన్నారు. అనంతరం అదే భవనంలో ఏపీ వైసీపీ కేంద్రకార్యాలయాన్ని జగన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులు పాల్గొన్నారు.
ఇప్పటివరకు ఏపీ, తెలంగాణ రాజకీయ వ్యవహారాలన్నీ హైదరాబాద్లోని లోటస్ పాండ్ నివాసం నుంచే జగన్ పర్యవేక్షించేవారు. ఏపీలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు దగ్గరపడుతున్నందున ఇకపై ఏపీకి సంబందించిన రాజకీయ వ్యవహారాలన్నీ తాడేపల్లిలోని వైసీపీ కేంద్రకార్యాలయం నుంచే పర్యవేక్షించబడతాయి.