ధర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ...పృధ్వీ పొలిటికల్ ఇన్నింగ్స్ షురూ

February 18, 2019


img

“ఇక్కడ ధర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అమ్మా...’అనే ఓ చిన్న డైలాగ్ వినగానే టక్కున గుర్తొచ్చే నటుడు పృధ్వీరాజ్.  సినీ పరిశ్రమలోని వారు రాజకీయాలకు ఎందుకు ఆకర్షితులవుతారో తెలియదు కానీ ఎన్నికలు దగ్గరపడినప్పుడు చాలా మంది ఏదో ఓ పార్టీ కండువా కప్పుకొంటుంటారు. మన ధర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీ కూడా వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ కండువా కప్పుకొన్నారు.

సినిమా షూటింగులతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటుండటంతో ఆయనకు ఆంధ్రప్రదేశ్ వైసీపీ కార్యదర్శిగా నియమించారు ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి. కృష్ణా జిల్లాకు చెందిన పృధ్వీ రాజ్ ఈసారి ఆ జిల్లా నుంచి శాసనసభకు పోటీ చేయాలనుకొంటున్నట్లు సమాచారం. ఈసారి అధికార టిడిపి, ప్రతిపక్ష వైసీపీల మద్య తీవ్రస్థాయిలో పోటీ ఉండబోతున్నందున, పృధ్వీకి టికెట్ లభిస్తుందో లేదో... లభిస్తే గెలువగలరో లేదో చూడాలి. ఒకవేళ పోటీ చేసి గెలిచినట్లయితే పృద్వీ పొలిటికల్ ఇన్నింగ్స్ మొదలవుతుంది.      



Related Post