హెచ్ఎండీఏ కమిషనర్ జనార్ధన్రెడ్డిపై వేటు వేసింది ప్రభుత్వం. ప్రస్తుతం ఆయన విదేశీ పర్యటనలో ఉన్నారు. హైదరాబాద్ తిరిగి రాగానే సాధారణ పరిపాలనశాఖ ముఖ్యకార్యదర్శికి రిపోర్ట్ చేయాలని ఆదేశించడం విశేషం. ఆయన స్థానంలో మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్కు బాధ్యతలు అప్పగించింది.
హెచ్ఎండీఏ కమిషనర్గా జనార్ధన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తరువాత నగరంలో శరవేగంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఆయన పనితీరుపట్ల సిఎం కేసీఆర్ మాజీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తదితరులు కూడా సంతృప్తి వ్యక్తం చేసేవారు. కానీ ఆయన విదేశీపర్యటనలో ఉండగా ఇంత హటాత్తుగా పదవి నుంచి తప్పించడం, వేరే శాఖలో పోస్టింగ్ ఇవ్వకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.