ప్రజాకూటమికి 75 సీట్లు పక్కా: జైపాల్ రెడ్డి

November 28, 2018


img

సీనియర్ కాంగ్రెస్‌ నేత జైపాల్ రెడ్డి మీడియాతో మాట్లడుతూ, “నిజానికి మేము గత ఎన్నికలలోనే తెలంగాణలో గెలవవలసింది కానీ కొన్ని పొరపాట్లవలన గెలవలేకపోయాము. ఈసారి అవి పునరావృతం కాకుండా పూర్తి సన్నద్ధతో ఎన్నికలకు వెళుతున్నాము కనుక మా గెలుపు ఖాయం. పైగా రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలలో కేసీఆర్‌ ప్రభుత్వం పట్ల తీవ్ర అసంతృప్తి ఉంది. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు, దళితులకు మూడెకరాల భూమి, లక్ష ఉద్యోగాలు వంటి అనేక హామీలను అమలుచేయకుండా కేసీఆర్‌ తమను మోసం చేశారని ప్రజలు చాలా ఆగ్రహంగా ఉన్నారు. కనుక వారు కేసీఆర్‌ను గద్దె దించడానికి ఎదురుచూస్తున్నారు. నాకున్న రాజకీయ అనుభవంతో చెపుతున్నాను. ఈ ఎన్నికలలో ప్రజాకూటమి 75 సీట్లకు తక్కువ కాకుండా గెలుస్తుంది,” అని జైపాల్ రెడ్డి అన్నారు. 




Related Post