అమెరికా వెళ్ళాలనుకునేవారికి కనువిప్పు కలిగేనా?

June 10, 2025
img

అమెరికా వెళ్ళి ఉన్నత విద్యాలభ్యసించాలని, అక్కడే ఉద్యోగం సంపాదించుకొని స్థిరపడాలని తహతహలాడేవారు లక్షల మంది ఉన్నారు. వారికి ఈ తాజా ఘటన కనువిప్పు కలిగిస్తుందని ఆశించవచ్చు. అమెరికాలో నెవార్క్ విమానాశ్రయంలో హరియాణ్వీ అనే ఓ భారతీయ విద్యార్ధిని అమెరికా పోలీసులు సంకెళ్ళు వేసి విమానాశ్రయానికి తీసుకువచ్చారు.

అతను ఆవేదనతో “నేను ఏ తప్పు చేయలేదు. నాకేమీ పిచ్చి లేడు. ఉందని నమమయించేందుకు ప్రయత్నిస్తున్నారు,” అంటూ గట్టిగా అరవడంతో పోలీసులు అతనిని నేలపై పడేసి చేతులు వెనక్కి విరిచి మోకాళ్ళతో అదిమిపెట్టారు.

విమానాశ్రయంలో అందరి ముందు వారు తనని ఆవిదంగా బందిస్తుంటే ఆ యువకుడు బాధ, అవమానం భరించలేక కన్నీళ్ళు పెట్టుకున్నాడు. అతనిని బేడీలు వేసి సోమవారం రాత్రి విమానంలో భారత్‌కు తిప్పి పంపారు. 

అతనేమీ ఉగ్రవాది, సంఘవ్యతిరేకి కాదు. ఉన్నత విద్యాలభ్యసించడానికి వచ్చిన ఓ విద్యార్ధి. కానీ అమెరికా పోలీసులు ఓ కరడు గట్టిన ఉగ్రవాది పట్టుబడితే బందించినట్లు మీద పడి బందించడం చాలా దారుణం. 

అమెరికాలో ఇది సర్వసాధారణమే కావచ్చు. కానీ పోలీసులలో, అమెరికా వ్యస్థలో మానవత్వం లోపించిందని చెప్పక తప్పదు. అదే.. ఓ అమెరికన్ పౌరుడిని భారత్‌లో ఆవిదంగా బందించి అవమానిస్తే అమెరికా సమాజం, అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ సహించగలరా? భరించగలరా?

అక్కడే ఉన్న కునాల్ జైన్ అనే ఓ వ్యక్తి, తన మొబైల్ ఫోన్‌తో హృదయ విదారకమైన ఆ దృశ్యాలను చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. “ఎన్నో కలలతో అమెరికాలో అడుగుపెట్టిన ఆ యువకుడిని ఓ నేరస్తుడిని బండించినట్లు బండించి తీసుకువెళుతుంటే అది చూసి అక్కడే ఉన్న నా హృదయం ముక్కలైపోయింది. కానీ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోవలసి వచ్చింది,” అని ఆ వీడియోలో పేర్కొన్నారు. 

అమెరికాలో ఇండియన్ ఎంబసీ, భారత్‌ విదేశాంగ శాఖ దీనిపై స్పందించాలని కోరారు. కానీ వారు కూడా ఏమీ చేయలేరని అందరికీ తెలుసు. ఇటువంటి అవమానాలు ఎదురవుతుంటే ఇంకా అమెరికా వెళ్ళాలనుకోవడం అవివేకం కాదా? అందరూ ఆలోచించాల్సిన తరుణం ఇదే.  

Related Post