తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి శుక్రవారం హైదరాబాద్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ, “గుజరాత్ ప్రభుత్వం సబర్మతి నది ఒడ్డున పటేల్ విగ్రహంతో రివర్ ఫ్రంట్ ఏర్పాటు చేసింది. యూపీ ప్రభుత్వం అయోధ్యలో గంగానది ఒడ్డున రివర్ ఫ్రంట్ ఏర్పాటు చేసింది. ఢిల్లీ ప్రభుత్వం యమునా నది ఒడ్డున రివర్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తోంది. వీటి ద్వారా ఆ మూడు ప్రాంతాలు ఎంతగానో అభివృద్ధి చెందుతాయి. పర్యాటకులు పెరిగారు. ప్రభుత్వాలకు ఆదాయం కూడా వస్తుంది.
మూడు బిజేపి పాలిత ప్రాంతాలలో రివర్ ఫ్రంట్ ఏర్పాటు చేసినప్పుడు లేని అభ్యంతరాలు మా ప్రభుత్వం హైదరాబాద్లో మూసీ రివర్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తుంటేనే దేనికి?
మూసీ ప్రక్షాళన చేసి, రివర్ ఫ్రంట్ ఏర్పాటుచేసి స్థానికులు తీరం వెంబడి హోటల్స్, టిఫిన్ సెంటర్స్, దుకాణాలు వగైరా పెట్టుకునేందుకు తగిన ఏర్పాట్లు చేస్తాము. రాత్రి పూట కూడా నడిపించుకొని వ్యాపారాలు చేసుకునేందుకు వీలు కల్పిస్తాము.
ఈ ఒక్క ప్రాజెక్టుతో హైదరాబాద్ పేరు మారుమ్రోగిపోతుంది... అని తెలిసినా బిజేపి, బీఆర్ఎస్ పార్టీలు మురికి రాజకీయాలు చేస్తున్నాయి. అవి నగరాభివృద్ధి కోరుకుంటే ఇలాంటి నీచ రాజకీయాలు మానుకోవాలి,” అని సిఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
గుజరాత్ లో సబర్మతి రివర్ ఫ్రంట్, ఢిల్లీలో యమునా రివర్ ఫ్రంట్, యూపీలో గంగా రివర్ ఫ్రంట్ ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ, మన తెలంగాణలో మూసీ రివర్ ఫ్రంట్ ఏర్పాటు చేసుకోకూడదా? మూసీ నది పరివాహక ప్రాంతాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది, ఆయా ప్రాంతాల్లో రివర్ టూరిజం, నైట్ టూరిజంను అభివృద్ధి… pic.twitter.com/Em5WPkDNT5
— Telangana Congress (@INCTelangana) March 6, 2026