తెలంగాణ పర్యాటక శాఖ కార్యదర్శిగా చేస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సభర్వాల్ కంచ గచ్చిబౌలి భూవివాదంలో తలదూర్చి ఇప్పటికే ప్రభుత్వ ఆగ్రహానికి గురయ్యారు. ఆమెని వివరణ కోరుతూ పోలీసులు నోటీసులు కూడా ఇచ్చారు.
కానీ ఆమె మాత్రం తగ్గేదేలే అంటూ తెలంగాణ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారిన సుప్రీంకోర్టు తీర్పుకి సంబందించి వచ్చిన ఓ పోస్టుని, తెలంగాణ పోలీసులు తమ ఐఏఎస్ అధికారి (తనకు) నోటీస్ ఇవ్వడాన్ని ప్రశ్నిస్తూ అనూష రవి సూద్ అనే మహిళ చేసిన ట్వీట్ని ఆమె రీట్వీట్ చేశారు.
ఆమె ఈవిదంగా చేస్తుండటంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి చాలా ఇబ్బందికరంగా మారుతోంది. ప్రశ్నిస్తే సొంత ఐఏఎస్ అధికారికి కూడా నోటీస్ ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని బిఆర్ఎస్ పార్టీ వాదిస్తోంది.
ఈ నేపధ్యంలో ఆమె మళ్ళీ ఈ భూవివాదంలో ప్రభుత్వం తీరుని తప్పు పడుతున్న వార్తలను రీట్వీట్ చేయడంతో ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు సూచిస్తున్నారు. కనుక రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు ఆమెపై ఎటువంటి చర్య తీసుకుంటారో?