రూ.1,674 కోట్లు వ్యయంతో మియాపూర్ పరిధిలో సిఎం రేవంత్ రెడ్డి చేసిన శంకుస్థాపనలు, అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలే బీఆర్ఎస్ పార్టీ విమర్శలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న సమాధానంగా భావించవచ్చు.
• రూ.65.53 కోట్లతో నిర్మించిన బాచుపల్లి ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం.
• సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ భవన నిర్మాణానికి సిఎం రేవంత్ రెడ్డి శంకు స్థాపన చేశారు. దీని కోసం రూ.161 కోట్లు ప్రభుత్వం కేటాయించింది.
• మియాపూర్ చౌరస్తాలో రూ. 530 కోట్లు వ్యయంతో ఫ్లైఓవర్ నిర్మాణ పనులకు శంకుస్థాపన.
• రూ.308 కోట్లతో శేరిలింగంపల్లి ROB నిర్మాణ పనులకు శంకుస్థాపన
• రూ.229 కోట్లతో ORRకు ఇరువైపులా ఉన్న సర్వీస్ రోడ్డు కోసం ప్రధాన వంతెన నిర్మాణం, ORR నుండి కొత్త సర్వీస్ రోడ్డు ఏర్పాటుకు శంకుస్థాపన.
• 29.25 కోట్లతో కొల్లూరు ఇంటర్చేంజ్ సమీపంలోని రెండు రైల్వే ఓవర్ హెడ్స్ (RoBs) వరకు 4 లేన్ల అప్రోచ్ ర్యాంపుల నిర్మాణానికి శంకుస్థాపన
• రూ.26.50 కోట్లతో నానక్రామ్గూడ నుంచి గచ్చిబౌలి వరకు ORR ఎడమ వైపు ఉన్న ప్రధాన క్యారేజ్ వే విస్తరణకు శంకుస్థాపన.
• రూ. రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి శంకుస్థాపన.
• రూ.110 కోట్లతో శంకర్ పల్లి రోడ్ MGIT నుంచి మణికొండ వరకు పైప్ లైన్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన.
• రూ.14.40 కోట్లతో మాదాపూర్, నానక్ రామ్ గూడలో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ నిర్మాణానికి శంకుస్థాపన.