కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీరుని ప్రధాని మోడీ తప్పు పట్టడంతో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేస్తూ ఆయనకే ఓ మెసేజ్ పెట్టారు.
“ఈ వ్యవహారంపై మీరు స్పందించినందుకు చాలా సంతోషం. ఇది మొక్కుబడి ఖండన కాదని భావిస్తున్నాను. రేవంత్ రెడ్డి ప్రభుత్వం గచ్చిబౌలి భూములలో వంద ఎకరాలలో పచ్చటి చెట్లను నరికించేసి పర్యావరణానికి తీరని అపకారం చేశారు.
ఇది కాక ఈ వ్యవహారంలో రూ.10,000 కోట్ల కుంభకోణం కూడా జరిగిందని తెలియజేస్తూ మేము రిజర్వ్ బ్యాంక్, సీబీఐ, సెబీ తదితర సంస్థలకు తెలియజేసి విచారణ జరపాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
సుప్రీంకోర్టు నియమించిన సాధికార కమిటీ కూడా క్షేత్రస్థాయిలో పర్యటించి పర్యావరణానికి నష్టం జరిగిందని, రూ.10,000 కోట్ల కుంభకోణం జరిగిందని నిర్ధారించింది. కనుక తెలంగాణలో బీజేపి, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కు అవలేదని నిరూపించుకోవలసిన సమయం ఇదే. ఈ వ్యవహారంపై దర్యాప్తు సంస్థల చేత విచారణ జరిపించి మీ నిబద్దత చాటుకుంటారని ఆశిస్తున్నాను,” అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
బీజేపితో బహిరంగంగా పొత్తు పెట్టుకోవడానికి భయపడుతున్న బిఆర్ఎస్ పార్టీ, అవసరమైనప్పుడు దానితో తెర వెనుక చేతులు కలపడానికి సిద్దంగానే ఉంటుంది.
ఏదో విదంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టి మళ్ళీ అధికారంలోకి రావాలని కేసీఆర్, కేటీఆర్ చాలా ఆరాటపడుతున్నారు. కనుక ఈ కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో బీజేపి పెద్దలతో చేతులు కలిపి కేంద్రం మద్దతుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రయత్నిస్తోందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
<blockquote class="twitter-tweet"><p lang="en" dir="ltr">Dear Hon'ble Prime Minister <a href="https://twitter.com/narendramodi?ref_src=twsrc%5Etfw">@narendramodi</a> ji,<br><br>I was heartened to hear your speech about the destruction of Kancha Gachibowli Forest by Telangana CM Revanth Reddy. However, I hope it's not just lip service<br><br>The devastation in Kancha Gachibowli is not just a grave environmental… <a href="https://t.co/8byfzDwUkR">pic.twitter.com/8byfzDwUkR</a></p>— KTR (@KTRBRS) <a href="https://twitter.com/KTRBRS/status/1913058418685804740?ref_src=twsrc%5Etfw">April 18, 2025</a></blockquote> <script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>