రేపు కాంగ్రెస్‌ తుది జాబితా విడుదల

November 15, 2018


img

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు రెండు జాబితాలలో కలిపి మొత్తం 75 మంది అభ్యర్ధుల పేర్లను ప్రకటించింది. మిగిలిన 19 మంది అభ్యర్ధులతో కూడిన తుది జాబితాను శుక్రవారం విడుదల చేస్తామని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్-ఛార్జ్ రామచంద్ర కుంతియా తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ మొత్తం 94 స్థానాలలో పోటీ చేయబోతుండగా, మహాకూటమి భాగస్వాములుగా ఉన్న టిడిపి-14, టిజేఎస్-8, సిపిఐ-3 స్థానాలలో పోటీ చేయబోతున్నాయి. కానీ టిజేఎస్ 12 స్థానాల నుంచి పోటీ చేస్తుందని ఆ పార్టీ నేత విశ్వేశ్వర్ రావు నిన్న సాయంత్రమే ప్రకటించారు. కనుక కాంగ్రెస్‌-టిజేఎస్ మద్య ఇంకా మరో నాలుగు సీట్లపై చర్చలు జరుగుతున్నట్లు స్పష్టం అవుతోంది.

ఆ నాలుగు సీట్లను కాంగ్రెస్‌, టిజేఎస్ పార్టీలు పంచుకొంటాయా లేక స్నేహపూర్వక పోటీకి దిగుతాయో చూడాలి. ముఖ్యంగా జనగామ సీటును కాంగ్రెస్ పార్టీ పొన్నాల లక్ష్మయ్య కోసం తీసుకొంటుందో లేక టిజేఎస్ పార్టీకి విడిచిపెడుతుందో చూడాలి.


Related Post