కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి ఇవాళ్ళ ఒక సంచలన ప్రకటన చేశారు. డిసెంబరు 7న పోలింగ్ జరిగేలోగా ఇద్దరు తెరాస ఎంపీలు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని ప్రకటించారు. కానీ వారి పేర్లు వెల్లడించలేదు. కనుక ఆ ఇద్దరూ ఎవరో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాలి.
తాను ఈనెల 19వ తేదీన నామినేషన్ వేయబోతున్నట్లు రేవంత్రెడ్డి ప్రకటించారు. కొడంగల్ నుంచి తాను 30,000 ఓట్లు మెజార్టీతో విజయం సాధించడం ఖాయమని రేవంత్రెడ్డి నమ్మకం వ్యక్తం చేశారు.
కొడంగల్ నుంచి పట్నం నరేందర్ రెడ్డి (తెరాస), నాగురావు నామోజీ (బిజెపి), డాక్టర్ వెంకటేశ్వరులు (బిఎల్ఎఫ్) పోటీ చేస్తున్నారు.