కార్తీక్ రెడ్డికి బండ్ల గణేశ్‌తో చెక్?

November 10, 2018


img

మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డికి మహేశ్వరం నుంచి కాంగ్రెస్‌ టికెట్ ఖరారుకావడం లాంఛనప్రాయమేనని చెప్పవచ్చు కానీ రాజేందర్ నగర్ నుంచి పోటీకి సిద్దం అవుతున్న ఆమె కుమారుడు కార్తీక్ రెడ్డికి మాత్రం ఈసారి టికెట్ లభించకపోవచ్చు. ఒక కుటుంబంలో ఒక్కరికే టికెట్ అనే రాహుల్ గాంధీ విదించిన నిబంధనను కాంగ్రెస్ పార్టీ పెద్దగా పట్టించుకోనప్పటికీ, టికెట్ ఇవ్వలేని పరిస్థితి కలిగినప్పుడు ఈ నిబందన చూపడం మరిచిపోదు. 

ఈసారి ఎన్నికలలో తమ ఇద్దరికీ టికెట్లు కావాలని సబితా ఇంద్రారెడ్డి పట్టుబడుతున్నారు. అయితే మద్యలో సినీ నిర్మాత బండ్ల గణేశ్ హటాత్తుగా కాంగ్రెస్ పార్టీలోకి ఎంట్రీ ఇచ్చి రాజేందర్ నగర్ నుంచి పోటీ చేయాలనుకొంటున్నట్లు ప్రకటించడంతో, కార్తీక్ రెడ్డికి చెక్ పెట్టేందుకే బండ్లను పార్టీలోకి తీసుకువచ్చారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే, గత నాలుగేళ్ళుగా రాజేందర్ నగర్ నియోజకవర్గాలలో పట్టు పెంచుకొంటున్న కార్తీక్ రెడ్డిని కాదని కొత్తగా పార్టీలోకి వచ్చిన బండ్ల గణేశ్ పేరు అకస్మాత్తుగా తెరపైకి రావడమే అందుకు కారణం. నేడో రేపో కాంగ్రెస్‌ పార్టీ తన అభ్యర్ధుల జాబితాను ప్రకటించబోతోంది కనుక బండ్ల గణేశ్, కార్తీక్ రెడ్డిలో ఎవరికి టికెట్ లభించిందో తేలిపోతుంది.


Related Post