కాంగ్రెస్‌కు కోమటిరెడ్డి వార్నింగ్!

November 09, 2018


img

సీనియర్ కాంగ్రెస్‌ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాష్ట్ర కాంగ్రెస్‌ పెద్దలకు వార్నింగ్ ఇచ్చారు. మహాకూటమిలో సీట్ల సర్దుబాట్లలో భాగంగా నకిరేకల్ టికెట్ వేరే పార్టీకి కేటాయిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఆ టికెట్ చిరుమర్తి లింగయ్యాకే కేటాయించాలని, వేరే పార్టీకి కేటాయిస్తే జరుగబోయే పరిణామాలకు పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీనియర్ నేత జానారెడ్డి బాధ్యత వహించాలని హెచ్చరించారు. 

కాంగ్రెస్‌ అభ్యర్ధుల ఎంపికకు జరుగుతున్న చర్చలలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా పాల్గొంటూనే ఉన్నారు. అలాగే మహాకూటమిలో మిత్రపక్షాల ఒత్తిడిని కూడా స్వయంగా చూస్తూనే ఉన్నారు. పార్టీ అధ్యక్ష పదవి వీలైతే ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని ఆశిస్తున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంయమనం పాటించి పార్టీ నేతలతో అంతర్గతంగా మాట్లాడుకొని ఈ సమస్యను పరిష్కరించుకొని ఉంటే హుందాగా ఉండేది. కానీ ఎన్నికలు దగ్గర పడుతున్న కీలక సమయంలో ఈవిధంగా బహిరంగంగా తన పార్టీ పెద్దలకు వార్నింగ్ ఇవ్వడం విస్మయం కలిగిస్తుంది.


Related Post