కృష్ణయ్యకు పిలుపు...కాంగ్రెస్‌లో చేరుతారా?

October 27, 2018


img

బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య గత ఎన్నికలలో టిడిపి నుంచి పోటీ చేసి గెలిచినప్పటికీ, ఆ తరువాత ఆయనకు పార్టీకి దూరం పెరిగి నేటికీ అది అలాగే ఉండిపోయింది. దాంతో టిడిపి ఆయన పేరును టికెట్ కోసం మహాకూటమిలో ప్రతిపాదించలేదు. అయితే ఈసారి కాంగ్రెస్ పార్టీ ఆయనను అక్కున చేర్చుకోవడానికి సిద్దపడటం విశేషం. ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఆసక్తి చూపిస్తూ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి తదితర కాంగ్రెస్‌ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. వారి చర్చలు ఒక కొలిక్కి వచ్చినట్లున్నాయి. అందుకే డిల్లీ వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరవలసిందిగా ఆర్.కృష్ణయ్యకు కాంగ్రెస్‌ అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది.

తెరాస రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్, తెరాస బహిష్కృత నేతలు రాములు నాయక్, టి.నర్సారెడ్డి తదితరులు ఈరోజు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు సమాచారం. వారితోపాటు ఆర్.కృష్ణయ్య కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతారా లేదా? అనేది మరికొన్ని గంటలలో తేలిపోవచ్చు.


Related Post