రాహుల్ గాంధీకి సుస్వాగతం: అసదుద్దీన్ ఓవైసీ

October 20, 2018


img

కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి హైదరాబాద్‌ నగరంలో ఊహించని వ్యక్తి నుంచి ఆహ్వానం అందింది. ఆయనే మజ్లీస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ. ఈరోజు సాయంత్రం ఛార్మినార్ వద్ద రాజీవ్ సద్భావన దివస్ కార్యక్రమంలో పాల్గొనడానికి వస్తున్న రాహుల్ గాంధీకి స్వాగతం పలుకుతూ అసదుద్దీన్ ఓవైసీ ట్వీట్ చేశారు. “రాహుల్ జీ! మీకు స్వాగతం. హైదరాబాద్‌ నగరం మిత్రులనైనా, శత్రువులనైనా సాధారంగా ఆహ్వానిస్తుంది. భిన్నజాతుల సంస్కృతీ సంప్రదాయాలు ఏవిధంగా ఉంతాయో ఇక్కడ మీరు చూడవచ్చు. మీరు, బిజెపి అధ్యక్షుడు అమిత్ షా ఛార్మినార్ నియోజకవర్గం నుంచి ఎన్నికలలో పోటీ చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాను,” అని ట్వీట్ చేశారు. 

అసదుద్దీన్ ఓవైసీ రాహుల్ గాంధీని సాధారంగా ఆహ్వానిస్తున్నట్లు ట్వీట్ చేసినప్పటికీ, మరో విధంగా చెప్పాలంటే ఇక్కడ నుంచి పోటీ చేసి గెలిచి చూపించమని రాహుల్ గాంధీకి సవాలు విసిరినట్లే భావించవచ్చు. కాంగ్రెస్‌, బిజెపి అధ్యక్షులు రాహుల్ గాంధీ, అమిత్ షాలైనా  ఛార్మినార్ నుంచి పోటీ చేసి గెలవలేరని అసదుద్దీన్ ఓవైసీ చెపుతున్నట్లుంది.


Related Post