తెలంగాణా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇళ్ళు, కార్యాలయంపై ఈరోజు జరుగుతున్న ఐటి దాడులపై టి-పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందిస్తూ, “ఎన్నికలకు ముందు పాత కేసులను తిరుగదోడి కాంగ్రెస్ నేతలను అణగద్రొక్కాలని సిఎం కెసిఆర్ చేస్తున్న ప్రయత్నాలను మేము ఖండిస్తున్నాము. ఈరోజు రేవంత్ రెడ్డి ఇంటిపై జరుగుతున్న ఐటిత దాడులను రాజకీయ కక్ష సాధింపు చర్యగానే భావిస్తున్నాము. అధికారంలో ఉన్నవారు ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నేతలపై ఈవిధంగా రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడటం ఒక దూరలవాటుగా మారిపోయింది. ఈ ఎన్నికలలో ఓడిపోతామనే భయంతోనే సిఎం కెసిఆర్ మొన్న జగ్గారెడ్డి, ఈరోజు రేవంత్ రెడ్డి... ఇలాగ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యనేతలను టార్గెట్ గా చేసుకొని ఈవిధంగా కక్ష సాధింపులకు పాల్పడుతున్నారు. కానీ ఇటువంటి బెదిరింపులకు మేము భయపడేది లేదు. ఎన్నికలలో టిఆర్ఎస్ను గట్టిగా ఎదుర్కొంటాము,” అని అన్నారు.