ఇవాళ్ళ సిఎం కెసిఆర్, కేట్, కవితలపై తీవ్ర విమర్శలు చేయడం ద్వారా టిఆర్ఎస్తో కటీఫ్ చెప్పేసిన కొండా దంపతులు ఈ గురువారం ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు సమాచారం. కొండా సురేఖ కాంగ్రెస్ పార్టీలో చేరడం నిజమైతే ఆ పార్టీకి వరంగల్ లో బలమైన అభ్యర్ధి లభించినట్లే. కానీ కాంగ్రెస్ పార్టీ టిడిపి, టీజేఎస్, సిపిఐలతో పొత్తులు పెట్టుకొంటున్నందున ఒకవేళ వాటి కోసం పరకాల, వరంగల్ తూర్పు సీట్లు వదులుకోదలిస్తే కొండా సురేఖ పరిస్థితి ఏమిటి?అనే ప్రశ్న తలెత్తుతుంది.
ఆమె ఎలాగూ తన స్వంత బలంతోనే ఆ రెండు నియోజకవర్గాలలో కనీసం లక్ష ఓట్లు మెజార్టీతో అవలీలగా గెలవగలనని నమ్ముతున్నారు కనుక స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసి తన సత్తా చాటుకోగలిగితే టిఆర్ఎస్కు సమాధానం చెప్పినట్లు ఉంటుంది. ఎన్నికల తరువాత కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీలలో దేనికి ఆమె అవసరం ఉంటే దానిలోనే ఆమె చేరవచ్చు. అదే కాంగ్రెస్ పార్టీలో చేరినట్లయితే ఆమె గెలిచి పార్టీ ఓడిపోయినా లేదా పార్టీ గెలిచి ఆమె ఓడిపోయినా ఫలితం ఉండదు. కనుక స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసి తన సత్తా నిరూపించుకోవడమే మంచిదేమో?