కాంగ్రెస్ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇచ్చిన సంజాయిషీతో సంతృప్తి చెందని కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ మళ్ళీ ఈరోజు మరో షో-కాజ్ నోటీస్ పంపింది. మొదట ఆయన పార్టీ కార్యకర్తల సమావేశంలో కాంగ్రెస్ కమిటీల కూర్పును తప్పు పడుతూ విమర్శలు చేసినందుకు షో-కాజ్ నోటీస్ పంపగా అది చూసి ఆయన మరింత రెచ్చిపోయి రాష్ట్ర కాంగ్రెస్ నేతలపై తీవ్ర విమర్శలు చేసారు. కనుక ఈసారి వాటిపై 24 గంటలలోగా సంజాయిషీ కోరుతూ రాజగోపాల్ రెడ్డికి మళ్ళీ నోటీస్ పంపించింది. మొదటి నోటీసు పంపించినప్పుడే తనకు నోటీస్ పంపే అర్హత క్రమశిక్షణ కమిటీ సభ్యులు ఎవరికైనా ఉందా? అని ప్రశ్నించిన రాజగోపాల్ రెడ్డి రెండవసారి పంపిన ఈ షో-కాజ్ నోటీసుపై ఏవిదంగా స్పందిస్తారో ఈ పోరాటం చివరికి ఏవిదంగా ముగుస్తుందో చూడాలి.