బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఈరోజు మహబూబ్నగర్ బహిరంగసభలో మాట్లాడుతూ, “సిఎం కెసిఆర్ లోక్సభ ఎన్నికలతో పాటు శాసనసభ ఎన్నికలకు వెళితే ఓడిపోతామనే భయంతోనే ముందస్తు ఎన్నికలకు వెళుతున్నారు. అప్పుడు ఎన్నికలలో గెలవలేని పార్టీ ఇప్పుడు మాత్రం గెలుస్తుందా? సిఎం కెసిఆర్ తెలంగాణా ప్రజల ఆత్మగౌరవం గురించి మాట్లాడుతున్నారని విన్నాను. మజ్లీస్ నేతలకు భయపడి తెలంగాణా విమోచన దినోత్సవం జరపడానికి వెనకాడుతున్న కెసిఆర్ తెలంగాణా ప్రజల ఆత్మగౌరవం ఏవిధంగా కాపాడగలరు? తెలంగాణాలో మేము అధికారంలోకి వస్తే సెప్టెంబరు 17న తెలంగాణా విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరుపుతాము. ఇక రాహుల్ గాంధీ పగలు రాత్రి అనే తేడా లేకుండా కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేస్తుందని, తాను దేశానికి ప్రధానమంత్రి అయిపోతానని చాలా కలలు కంటున్నారు. అయితే ఆయన కలలు కలలుగానే మిగిలిపోతాయి. కేంద్రంలో, రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వస్తుంది,” అని అన్నారు.