స్వామీజీ నగర బహిష్కరణ..అమిత్ షా ఎంట్రీ!

July 13, 2018


img

శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానందస్వామికి ఆరునెలల పాటు హైదరాబాద్ నగర బహిష్కరణ విధించినప్పుడే భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హైదరాబాద్ రావడం యాదృచ్చికమే. స్వామీజీ విషయంలో రాష్ట్ర భాజపా నేతలు కొంచెం హడావుడి చేసి ఊరుకొన్నారు తప్ప దానిని ఒక రాజకీయ అవకాశంగా మలుచుకోలేదు. కానీ అమిత్ షాకు ఇటువంటి వ్యవహారాలను ఏవిధంగా అనుకూలంగా మలుచుకోవాలో బాగా తెలుసు.

ఈరోజు ఉదయం హైదరాబాద్ చేరుకొన్న అమిత్ షా మొదట ఆర్ఎస్ఎస్, వి హెచ్‌పి నేతలతోనే సమావేశమయ్యారు. వారు ఇదే విషయం అయన చెవిలో వేయగా అక్కడే ఉన్న రాష్ట్ర భాజపా నేతలు తాము ఈ విషయం గురించి గవర్నర్ నరసింహన్ కు పిర్యాదు చేశామని చెప్పారు. కనుక అమిత్ షా ఇప్పుడు ఇదే అంశాన్ని ఆయుధంగా మలిచి భాజపా నేతల చేతిలో పెడతారేమో?



Related Post