కిరణ్ సెకండ్ ఇన్నింగ్స్ ముహూర్తం ఖరారు

July 06, 2018


img

సమైక్యరాష్ట్ర చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయజీవితంలో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు ముహూర్తం ఖరారు అయినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నేడో రేపో అయన డిల్లీ వెళ్లి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమావేశం అవుతారని, మళ్ళీ జూలై 13న మరోమారు డిల్లీ వెళ్లి రాహుల్ గాంధీ సమక్షంలో మళ్ళీ కాంగ్రెస్ కండువా కప్పుకొంటారని తాజా సమాచారం. 

ఇటీవల కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరైన ఏపి సిఎం చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి షేక్ హ్యాండ్ ఇచ్చి, ఆప్యాయంగా మాట్లాడారు. ఆ తరువాత రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్-తెదేపాలు కలిసి పనిచేసే అవకాశం ఉందని ప్రకటించారు. అది తెలంగాణాలో సాధ్యమే కావచ్చు.  కానీ ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి రీ-ఎంట్రీ ఇస్తే ఏపిలో కాంగ్రెస్-తెదేపాలు కలిసి పనిచేయలేవు. పైగా వాటిమధ్య మళ్ళీ రాజకీయవైరం ప్రారంభంకావచ్చు. కనుక కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి రీ-ఎంట్రీ ఇస్తే ఏపిలో పార్టీల బలాబలాలు మారవచ్చు. 


Related Post