నా కూతురుని ఆశీర్వదించండి: కొండా సురేఖ

June 28, 2018


img

కొండా సురేఖ దంపతులు తెరాసలో చేరి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలుగా ఎన్నికైనప్పటికీ పార్టీలో, ప్రభుత్వంలో వారికి తగినంత గుర్తింపు లభించడంలేదనే సంగతి అందరికీ తెలుసు. పైగా ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న వరంగల్ నియోజకవర్గంలో తెరాస నేతలతో వారికి పొసగడం లేదని, ఆ కారణంగా వారు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోతారనే ఊహాగానాలు కూడా వినిపించాయి. కానీ నేటికీ వారిరువురూ తెరాసలోనే ఉన్నారు. కానీ వచ్చే ఎన్నికలలో కొండా సురేఖకు టికెట్ లభిస్తుందో లేదో తెలియదు. ఈ పరిస్థితులలో ఆమె తన కుమార్తె సుస్మితా పటేల్ ను తమ రాజకీయవారసురాలిగా ప్రజలకు పరిచయం చేసి, ఆమెను ఆశీర్వదించవలసిందిగా కోరడం విశేషం. తన నియోజకవర్గంలోని ప్రజలు ఆమె ఎమ్మెల్యే కావాలని కోరుకొంటున్నారని, వచ్చే ఎన్నికలలో తెరాస అధిష్టానం ఆమెకు టికెట్ కేటాయిస్తుందని  కొండా సురేఖ నమ్మకం వ్యక్తం చేశారు. తన స్థానానికే తెరాస నేతలు పోటీపడుతుంటే, తనతో పాటు కూతురుకు కూడా టికెట్ లభిస్తుందని కలలుకనడం ఆశ్చర్యకరమే. 



Related Post