టాలీవుడ్ కు మరో మరక

June 14, 2018


img

ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమకు దానిలో పనిచేస్తున్నవారికీ ప్రజలలో ఎంతో గౌరవం ఉండేది. ఇప్పుడు కూడా ఉంది కానీ అది కొందరికే పరిమితం. సినీ పరిశ్రమలో వెలుగు చూసిన మాదకద్రవ్యాల కేసులు, క్యాస్టింగ్ కౌచింగ్ వంటివి  సినీపరిశ్రమకు చెడ్డపేరు తెచ్చాయి. తాజాగా మరొక అనైతిక వ్యవహారం వెలుగులోకి వచ్చింది. 

తెలుగు సినీ పరిశ్రమలోని అవకాశాలు లేక ఆర్ధిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న హీరోయిన్లను అమెరికాలోని చికాగోలో స్థిరపడిన కిష‌న్ మోదుగుమూడి, చంద్ర‌ దంపతులు సాంస్కృతిక కార్యక్రమాల పేరిట అమెరికాకు రప్పించి అక్కడ వారి చేత వ్యభిచారం చేయిస్తున్నట్లు నిఘా సంస్థల దర్యాఫులో బయటపడింది. 

అమెరికాలో వ్యాపారం చేసుకొంటున్న కిష‌న్ మోదుగుమూడి కొన్ని తెలుగు సినిమాలకు సహనిర్మాతగా వ్యవహరించి ఉండటంతో వారికి తెలుగు సినీపరిశ్రమలో వారితో పరిచయాలు ఏర్పడ్డాయి. సినీపరిశ్రమలోని కొందరు హీరోయిన్లు అవకాశాలు లభించక తీవ్ర ఆర్ధిక ఇబ్బందులలో ఉన్నారని గుర్తించిన ఆ దంపతులు వారి సమస్యను ఒక అవకాశంగా మలుచుకొన్నారు. వారిని చికాగోకు రప్పించి వారిచేత వ్యబిచారం చేయిస్తున్నారు. 

కిష‌న్ మోదుగుమూడి హీరోయిన్లకు గాలం వేసి అమెరికా రప్పిస్తుంటాడు. అతని భార్య విటులకు ఫోన్లు చేసి వారితో రేట్లు మాట్లాడుకొని డబ్బు వసూలు చేసుకొనేది. ఇది చాలాకాలంగా సాగుతున్నప్పటికీ వారిరువురూ చాలా తెలివిగా నడిపిస్తుండటంతో ఈ వ్యవహారం మూడవకంటికి తెలియకుండా గుట్టుగా సాగిపోయింది. కానీ గత ఏడాది క్రిస్ మస్ పండుగ సందర్భంగా ఒక హీరోయిన్ ను రప్పించినప్పుడు ఆమెతో వారికి సరిగ్గా బేరాలు కుదరలేదు. దాంతో ఆమె వారిని ప్రతిఘటించింది. తనను వేదించవద్దని ఈ-మెయిల్ ద్వారా వారికి విజ్ఞప్తి చేసింది. 

ఆ ఈమెయిల్ నిఘా సంస్థ కంటపడటంతో తీగ లాగితే డొంకంతా కదిలి ఈ వ్యవహారం వెలుగు చూసింది. పోలీసులు వారి ఇంటిపై దాడి చేసి సోదాలు నిర్వహించగా కండోం ప్యాకెట్లు, విటుల ఫోన్ నెంబర్లున్న డైరీ వగైరాలు పట్టుబడ్డాయి. పోలీసులు వారిరువురిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. దీనికి సినీపరిశ్రమను నిందించలేము కానీ తెర వెనుక జరుగుతున్న మరోరకమైన అకృత్యాలు దీంతో బయటపడ్డాయి.


Related Post