కరీంనగర్ లో తెదేపా ఖాళీ?

November 14, 2017


img

టిటిడిపి అధ్యక్షుడు ఎల్.రమణ పార్టీ నుంచి ఎంతమంది నేతలు వెళ్ళిపోయినా పార్టీకి వచ్చే నష్టమేమీ లేదన్నారు. బహుశః అందుకేనేమో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మందని, రాజన్న సిరిసిల్ల, హుస్నాబాద్ నియోజకవర్గపు టిటిడిపి ఇన్-ఛార్జ్ లు అన్నమనేని నర్సింగరావు, పెర్యాల్ రవీందర్ రావు, కర్రు నాగయ్య ముగ్గురూ తెదేపాకు గుడ్-బై చెప్పేసి రేపు ముఖ్యమంత్రి కెసిఆర్ సమక్షంలో తెరాసలో చేరబోతున్నారు. కరీంనగర్ నుంచే మరికొందరు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. విశేషమేమిటంటే, ఎల్.రమణ స్వస్థలం జగిత్యాల్ కావడంతో ఈ మూడు నియోజకవర్గాలపై ఆయనకు మంచి పట్టుంది. అక్కడి నుంచే టిటిడిపి ఖాళీ అయిపోతుండటమే విశేషం. ఒకపక్క వేగంగా పార్టీ ఖాళీ అయిపోతుంటే, అయన రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పిస్తూ, సవాళ్ళు విసురుతూ కాలక్షేపం చేయడం విశేషమే.     



Related Post