తెలంగాణా ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ పధకానికి సాక్షాత్ ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసిస్తూ మంత్రి కేటిఆర్ కు లేఖ వ్రాశారు. దానిలో మహాత్మా గాంధీజి ఆశయాలకు, కలలకు అనుకూలంగా కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న స్వచ్చ భారత్, మిషన్ భగీరథ వంటి పధకాలే ప్రస్తుతం దేశానికి చాలా అవసరమని, రాష్ట్రంలో ప్రజలందరికీ మంచినీటిని అందించడానికి మీరు చేస్తున్న ప్రయత్నాకు అభినందనీయం. దేశమంతా పరిశుభ్రంగా ఉండాలని గాంధీజీ కోరుకొనేవారిని ఆయన కలలు సాకారం చేయడానికి కేంద్రప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా ‘స్వచ్చతా హై సేవా” అనే కార్యక్రమానికి మీ సహాయసహకారాలు మద్దతు ఇవ్వాలని, దీనిలో మీరు కూడా పాల్గొని మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేయాలని కోరుతున్నానని ప్రధాని లేఖలో వ్రాశారు.