బీసీ రిజర్వేషన్స్: బీఆర్ఎస్‌ నిరసనలు, జాగృతి విజయోత్సవాలు!

July 12, 2025


img

తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో త్వరలో జరుగబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్స్ కేటాయించాలని నిర్ణయించారు. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసి చట్ట సవరణ చేయాలని నిర్ణయించింది. దీనిపై బీఆర్ఎస్‌ పార్టీ, తెలంగాణ జాగృతి స్పందన పూర్తి భిన్నంగా ఉండటం చాలా విచిత్రం. 

కల్వకుంట్ల కవిత స్పందిస్తూ, “బీసీ రిజర్వేషన్స్ కోసం మేము చేసిన పోరాటాలతోనే ప్రభుత్వం దిగివచ్చి ఆర్డినెన్స్ జారీ చేసేందుకు సిద్దమైంది. దీంతో మేము ఒక మెట్టు ఎక్కి తొలి విజయం సాధించినట్లు భావిస్తున్నాను. కనుక తెలంగాణ జాగృతి సభ్యులు విజయోత్సవాలు జరుపుకోవాలని కోరుతున్నాను. కానీ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇక్కడితో సరిపెట్టకుండా బీసీలకు విద్యా, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్స్ కొరకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రాజ్యాంగ సవరణ చేసేంతవరకు పోరాడుతూనే ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు.   

కానీ బీఆర్ఎస్‌ పార్టీ ఈ విషయంలో ప్రభుత్వ వైఖరిని తప్పు పడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. బీసీలని సిఎం రేవంత్ రెడ్డి మరోసారి మోసం చేయాలని ప్రయత్నిస్తున్నారంటూ ఆయన దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తోంది. బీసీ రిజర్వేషన్స్ పెంపు కోసం కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేయనప్పుడు, రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా చట్ట సవరణ చేసి రిజర్వేషన్స్ అమలుచేస్తామని చెప్పడం బీసీలను మోసం చేయడమే అని బీఆర్ఎస్‌ పార్టీ వాదిస్తోంది. 

<blockquote class="twitter-tweet" data-media-max-width="560"><p lang="te" dir="ltr">బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్ దిష్టిబొమ్మ దహనం చేసిన బీఆర్ఎస్ నేతలు<br><br>బీసీలకు న్యాయం చేయకుండా తప్పుడు విధానాలతో రిజర్వేషన్లను తొక్కుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బంజారాహిల్స్ అగ్రసేన్ మహారాజ్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ… <a href="https://t.co/ELzkgTy6xF">pic.twitter.com/ELzkgTy6xF</a></p>&mdash; BRS Party (@BRSparty) <a href="https://twitter.com/BRSparty/status/1943620885832974724?ref_src=twsrc%5Etfw">July 11, 2025</a></blockquote> <script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>

Related Post