మూసీ ప్రక్షాళన పేరుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం రూ.25,000 కోట్ల కుంభకోణానికి పాల్పడుతోందంటూ బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. మూసీ ప్రక్షాళన అనేది కేవలం కాంగ్రెస్ నేతలు జేబులు నింపుకోవడానికే అని కేటీఆర్ పదే పదే వాదిస్తుండటంతో కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు ఆత్రం సుగుణ ఆయనపై ఉట్నూరు పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేయగా వారు పలు సెక్షన్స్ కింద కేటీఆర్పై కేసు నమోదు చేశారు. ఆయన దానిపై హైకోర్టులో పిటిషన్ వెయ్యగా జస్టిస్ కె లక్ష్మణ్ ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టి ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత ఆమె పిటిషన్ని కొట్టివేశారు. అలాగే ఉట్నూరు పోలీస్ స్టేషన్లో కేటీఆర్పై నమోదు చేసిన రద్దు చేస్తున్నట్లు తీర్పు చెప్పారు.
ఈ కేసు నుంచి కేటీఆర్కి విముక్తి కలిగింది కనుక ఇకపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం మూసీ ప్రక్షాళన ప్రాజెక్టులో అడుగు ముందుకు వేసిన ప్రతీసారి కేటీఆర్ మళ్ళీ ఇవే ఆరోపణలు చేయకుండా ఉండరు. ఆయన చేస్తున్న ఈ ఆరోపణలు ప్రజలలోకి వెళ్ళాయి.. ఇంకా వెళ్తాయి.
వాటి వలన రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్ల ప్రజలకు అనుమానాలు, అపోహలు కలిగే అవకాశం ఉంటుంది కదా? ఈ ఆరోపణల వలన వ్యక్తిగతంగా సిఎం రేవంత్ రెడ్డికి, రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి కలిగే అప్రదిష్ట, నష్టాన్ని ఏవిధంగా పోగొట్టుకోగలరు? నష్ట నివారణకు ఏమి చేస్తారు?