ఇదివరకు వెంకటేష్ చేసిన ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’, ‘వాసు’ మూడు సూపర్ హిట్ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే ఇచ్చారు. ఇప్పుడు తొలిసారిగా వెంకటేష్తో కలిసి త్రివిక్రమ్ ‘ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్: 47’ సినిమా చేస్తున్నారు.
ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్: 47 ని ఇంగ్లీషులో ‘ఏకే-47’ అని పేర్కొనడంతో ఈ సినిమాపై చాలా భారీ అంచనాలే ఉన్నాయి. వెంకటేష్ మార్క్ కామెడీ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. ఈ సినిమాలో వెంకటేష్ పాత్రను చిట్టిబాబుగా పరిచయం చేస్తూ విడుదల చేసిన ఫస్ట్ గ్లిమ్స్ ఇందుకు ఓ చిన్న శాంపుల్.. ఆదర్శ కుటుంబం ఎంత గొప్పగా ఉంటుందో అర్థం చేసుకోవడానికి!
ఆదర్శ కుటుంబంలో వెంకటేష్కి జోడీగా శ్రీనిధి శెట్టి నటిస్తున్నారు. ఈ సినిమాలో నారా రోహిత్, నివేదా పేతురాజ్, యువినా, రాజా ప్రజ్వల్, రావు రమేష్, రఘుబాబు, సత్య, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్ తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకి కథ, దర్శకత్వం: త్రివిక్రమ్ శ్రీనివాస్; సంగీతం: థమన్ ఎస్; కెమెరా: రవి కె. చంద్రన్; ఎడిటింగ్: ఎ. శ్రీకర్ ప్రసాద్, యాక్షన్: కెవిన్ కుమార్ చేస్తున్నారు.
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్పై ఎస్. రాధాకృష్ణ ఈ సినిమా నిర్మిస్తున్న ఆదర్శ కుటుంబం గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న విడుదల కాబోతోంది.