తెలంగాణ సాంస్కృతిక, పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సభర్వాల్ నేడు సోషల్ మీడియాలో మరో పోస్టు పెట్టారు.
దానిలో ఆమె ఏమన్నారంటే, “గచ్చిబౌలి పోలీస్ అధికారుల విచారణకు పూర్తిగా సహకరించాను. చట్టాన్ని గౌరవించే పౌరురాలిగా గచ్చిబౌలి భూములకు సంబందించి వారు అడిగిన ప్రశ్నలన్నీటికీ వివరణ ఇచ్చాను. అయితే ఆ పోస్టుని నేను ఒక్కదానినే కాదు.. సుమారు మరో 2,000 మంది షేర్ చేశారు. కనుక వారందరిపై కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారా? అని నేను పోలీస్ అధికారులను అడిగాను.
ఒకవేళ అందరిపై చర్యలు తీసుకొన్నట్లయితే కొంత మంది ఎంపిక చేసుకున్న వ్యక్తులను లక్ష్యంగా చేసుకొని నోటీస్ పంపిస్తున్నట్లు భావించాల్సి ఉంటుంది. ఇది నైతిక విలువలు, సహజ న్యాయానికి విరుద్దంగా ఉందనిపిస్తుంది. చట్టం ముందు అందరూ సమానమనే మాటకు భిన్నంగా ఉంది,” అని వ్రాశారు.
కిందన #రూల్ ఆఫ్ లా #ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ #జస్ట్ సేయింగ్ అని హ్యాష్ ట్యాగ్స్ పెట్టారు. ఆమె ఈరోజు మద్యాహ్నం పెట్టిన ఈ పోస్టుపై ఇప్పటి వరకు 75 మంది స్పందించారు మరో 277 మంది రీట్వీట్ చేశారు. మరో 911 మంది ఆమెకు సంఘీభావం వ్యక్తం చేశారు.