కర్ణాటకలో స్వతంత్ర ఎమ్మెల్యేపై అనర్హత వేటు

July 25, 2019


img

కర్ణాటకలో మళ్ళీ రాజకీయ కల్లోలం మొదలైనట్లే ఉంది. మాజీ సిఎం సిద్దరామయ్య ఫిర్యాదుపై సానుకూలంగా స్పందించిన అసెంబ్లీ స్పీకర్ రమేశ్ కుమార్, బిజెపిలో చేరేందుకు ప్రయత్నించిన స్వతంత్ర ఎమ్మెల్యే ఆర్‌.శంకర్‌పై అనర్హత వేటు వేశారు. ఆయన 2023 వరకు ఏ ఎన్నికలలో పోటీ చేయడానికి అనర్హుడని ప్రకటించారు. దీంతో 13 మంది కాంగ్రెస్‌, ఇద్దరు జెడిఎస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలు బిజెపిలో చేరేందుకు ప్రయత్నిస్తే ఏమవుతుందో చెప్పకనే చెప్పారు. కనుక ఇంతకాలం కాంగ్రెస్‌-జెడిఎస్‌ల సంకీర్ణ ప్రభుత్వంతో చెలగాటం ఆడిన ఎడ్యూరప్పకు ఇప్పుడు ఆట మొదలైనట్లే ఉంది. 



Related Post