కోమటిరెడ్డికి జగదీశ్ రెడ్డి సవాల్

February 19, 2018


img

కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మంత్రి జగదీశ్ రెడ్డి ఈరోజు ఒక సవాలు విసిరారు. “బొడ్డుపల్లి శ్రీనివాస్ తన తమ్ముడి వంటివాడని మొసలి కన్నీళ్లు కారుస్తున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి వచ్చే ఎన్నికలలో శ్రీనివాస్ భార్య లక్ష్మికి శాసనసభ టికెట్ ఇప్పించగలరా? శ్రీనివాస్ చనిపోయినప్పుడు ఆమెకు టికెట్ ఇప్పిస్తానని చెప్పుకొన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పుడు అదే మాటను గట్టిగా ఎందుకు చెప్పలేకపోతున్నారు? శవరాజకీయాలు చేసి రాజకీయ లబ్ది పొందలనుకొంటున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వచ్చే ఎన్నికలలో నల్లగొండ జిల్లా ప్రజలే గట్టిగా బుద్ధి చెపుతారు,” అని మంత్రి అన్నారు.

బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య జరిగి నేటికి మూడువారాలు గడిచిపోయాయి. మొదట కాంగ్రెస్ నేతలు అందరూ కలిసి ముప్పేట దాడి చేసినప్పుడు తెరాస నేతలు కాస్త ఒత్తిడికి గురయినట్లే కనబడ్డారు. కానీ వారు కూడా తేరుకొని కాంగ్రెస్ పార్టీపై ఎదురుదాడి చేయడం ప్రారంభించడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి కాంగ్రెస్, తెరాస నేతలు ఈ హత్యను ఒక మనిషి నిండు నూరేళ్ళ జీవితానికి...అతనిపైనే ఆధారపడున్న ఒక కుటుంబానికి సంబందించిన అత్యంత బాధాకరమైన విషయంగా కాక, ఒక రాజకీయ అంశంగా మాత్రమే చూస్తున్నారనే భావన కలుగుతోంది. దీనిని ప్రజలు గుర్తించలేరనుకొంటే కాంగ్రెస్, తెరాసలే నష్టపోయే ప్రమాదం ఉందని గ్రహిస్తే మంచిది.


Related Post