తమిళనాడులో జరుగుతున్న కబడ్డీ పోటీలలో పాల్గొనేందుకు వెళ్ళిన తెలంగాణ కబడ్డీ ఆటగాళ్లను చెన్నైలో పోలీసులు అరెస్ట్ చేశారు. వారందరూ తమిళనాడులో పుదుచ్చేరిలో కబడ్డీ ఆడి అన్నాసలై నుంచి చెన్నైలోని ఎగ్మూరుకు బస్సులో తిరిగి వస్తుండగా టికెట్ విషయంలో వాళ్ళు కండక్టర్తో గొడవపడ్డారు. బస్సు చెన్నైలోని ఎగ్మూరు చేరుకోగానే కండక్టర్ ఫిర్యాదు మేరకు పోలీసులు వారిని అదుపులో తీసుకున్నారు.