సినీ ప్రముఖులు, ముఖ్యంగా అగ్ర నటీనటులు గుళ్ళు గోపురాలు దర్శిస్తుండటం పరిపాటే. అయితే ఎవరూ సినిమాలు మానుకొని గుళ్ళు గోపురాలకు వెళ్ళరు. ఏదైన పెద్ద సమస్య ఎదురైనప్పుడు లేదా సమంతలా జీవితంలో ఎదురుదెబ్బలు తిన్నప్పుడు మాత్రమే సినిమాలు పక్కన పెట్టేసి గుళ్ళు గోపురాలు దర్శిస్తుంటారు.
మలయాళ నటి సంయుక్తా మేనన్ ప్రస్తుతం సినిమాలు చేయడం మానుకొని గుళ్ళు గోపురాలు దర్శిస్తున్నారు. ఆమె 2016లో భీమ్లా నాయక్ సినిమాతో టాలీవుడ్లో అడుగుపెట్టింది. ఆ తర్వాత వరుసగా బింబిసార, సర్, విరూపాక్ష హిట్స్ సినిమాలు చేసింది. ఆమె తెలుగులో చివరిగా చేసిన సినిమా ‘డెవిల్’ ఫ్లాప్ అయిన తర్వాత మరో సినిమా చేయలేదు. అంటే ఆమెకు ఆఫర్స్ రావడం లేదా లేక ఆమె ఆఫర్స్ తిరస్కరించారో గానీ అప్పటి నుంచి ఆమె గుళ్ళు గోపురాలు దర్శిస్తున్నారు.
తాజాగా ఆమె అస్సాంలోని ప్రముఖ కామాఖ్య ఆలయాన్ని దర్శించి అక్కడ తీసుకున్న ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నారు. అంటే ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్గానే ఉన్నట్లు అర్దమవుతోంది. కానీ ఆమె సినిమా ప్రయత్నాలు చేసుకోకుండా గుళ్ళు గోపురాల చుట్టూ ఎందుకు తిరుగుతున్నారో? ఆమె చెప్పాలి.