దేశానికి, రాష్ట్రానికి కాంగ్రెస్‌ ఎప్పుడూ ప్రమాదకరమే: మోడీ

April 30, 2024


img

ప్రధాని నరేంద్రమోడీ ఈరోజు లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి తెలంగాణకు వచ్చారు. మెదక్ జిల్లా అల్లాదుర్గంలో జరిగిన ఎన్నికల సభలో ప్రధాని నరేంద్రమోడీ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. “కాంగ్రెస్ పార్టీ దేశానికి, ఏ రాష్ట్రానికైనా చాలా హానికరమే. 

కాంగ్రెస్‌ పార్టీ అవినీతి, అబద్దాలు, మాఫియాలు, కుటుంబ పాలన, ఓటు బ్యాంకు రాజకీయాలు అనే పంచసూత్రాల ఆధారంగానే పనిచేస్తుంది తప్ప దేశం, రాష్ట్రం గురించి దానికి ఏమాత్రం శ్రద్దలేదు. 

ఆర్ఆర్ఆర్ సినిమా యావత్ దేశం గర్వపడేలా చేసింది. కానీ తెలంగాణ అమలవుతున్న ఆర్ఆర్ (రేవంత్‌ రెడ్డి) టాక్స్ యావత్ దేశం సిగ్గుపడేలా చేస్తోంది. తెలంగాణ లో బలవంతంగా వసూలు చేసిన సొమ్ముని ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీకి మూటలు కట్టి పంపిస్తుండటం సిగ్గుచేటు. 

ఇదివరకు బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నేతలు రాష్ట్రాన్ని అభివృద్ధి పేరుతో దోచుకుంటే, తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏమీ చేయకుండానే దోచుకుంటోంది. కాంగ్రెస్‌, బీజేపీలు రెండూ అవినీతి పార్టీలే. వీటిని అడ్డుకోవాలంటే రాష్ట్రంలోను, జాతీయ స్థాయిలో బీజేపీని గెలిపించాలి,” అని ప్రధాని నరేంద్రమోడీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.


Related Post