రాయలసీమ ఎత్తిపోతల పధకంపై ఇటీవల కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మద్య తీవ్రస్థాయిలో వాదోపవాదాలు జరిగాయి. ఇంకా జరుగుతూనే ఉన్నాయి. సిఎం రేవంత్ రెడ్డి శాసనసభలో మాట్లాడుతూ “ఏపీ సిఎం చంద్రబాబు నాయుడుతో మాట్లాడి నేనే ఆ ప్రాజెక్ట్ పనులు ఆపించేశాను,” అని చెప్పుకుంటే, “కాదు 2020లో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్తో మాట్లాడి మేమే ఆపించేశామని,” హరీష్ రావు చెప్పుకున్నారు.
ఇక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఇలా వాదించుకుంటూ ఉంటే, అక్కడ ఏపీలో కూడా సిఎం చంద్రబాబు నాయుడు, మాజీ సిఎం జగన్వాదించుకుంటున్నారు.
మేమే ఈ ప్రాజెక్ట్ పనులు వేగవంతం చేశామని, కానీ తెలంగాణ పాలకుల ఒత్తిళ్ళకు తలొగ్గి మీరే పనులు నిలిపివేశారని పరస్పరం వాదించుకుంటున్నారు.
జగన్పై ఒత్తిడి చేసి ఈ ప్రాజెక్ట్ పనులు నిలిపివేయించామని హరీష్ రావు చెప్పుకున్నారు. కానీ అది నిజం కాదని జగన్ చెప్పిన ఈ మాటలు వింటే అర్ధమవుతుంది.
🚨 #RayalaseemaDrohiCBN
— YSR Congress Party (@YSRCParty) January 9, 2026
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ను @ncbn ఆపేసినందుకు తప్పకుండా ఉద్యమాలు జరుగుతాయి.
ఈరోజు తన స్వార్థంతో చంద్రబాబు అడ్డుకోవచ్చు. కానీ, అది తాత్కాలితమే. మేము అధికారంలోకి వచ్చాక వాయువేగంతో పూర్తి చేస్తాం.
-వైయస్ జగన్ గారు, వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు… pic.twitter.com/s3YLg7Iljs