టిజిఎస్ఆర్టీసీ బస్సులలో టికెట్ ఛార్జీలు పెంచిన్నట్లు సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను ఆ సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ ఖండించారు. ఎవరో ఉద్దేశ్యపూర్వకంగా తమ సంస్థకు వ్యతిరేకంగా ఇటువంటి దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇటీవల కేంద్ర ప్రభుత్వం టోల్ ప్లాజా ఫీజులు పెంచడంతో వాటి ద్వారా పయనించే బస్సులలో మాత్రమే ఆ మేరకు ఛార్జీలు సవరించాము తప్ప ఇతర మార్గాలలో టికెట్ ఛార్జీలు పెంచలేదని వీసీ సజ్జనార్ ట్వీట్ చేశారు. తమ సంస్థ ప్రతిష్టకు భంగం కలిగించే విదంగా ఇటువంటి దుష్ప్రచారం చేస్తే పోలీసుల సాయంతో వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో వివరణ ఇస్తూ ఘాటుగా ఓ సందేశం పోస్ట్ చేశారు.
టిజిఎస్ఆర్టీసీని లక్ష్యంగా చేసుకొని కొందరు గత కొంతకాలంగా సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఏదైనా రాజకీయ పార్టీ ఈవిదంగా చేయిస్తోందా లేక ఎవరైనా ఆకతాయిలు చేస్తున్నారా? అనేది విచారణ జరిపించి తెలుసుకోవడం అవసరమే.
#TGSRTC బస్సుల్లో సాధారణ ఛార్జీలు పెరిగాయని జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదు. సాధారణ చార్జీలు యథాతథంగానే ఉన్నాయి. హైవేలపై టోల్ చార్జీలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఆ పెంచిన టోల్ చార్జీల మేరకు టికెట్ లోని టోల్ సెస్ ను సంస్థ సవరించడం జరిగింది. ఈ… pic.twitter.com/kO2mbAkjl2
— VC Sajjanar - MD TGSRTC (@tgsrtcmdoffice) June 12, 2024