తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డితో సహా కాంగ్రెస్ మంత్రులు ఎన్నికల ప్రచారంలో బీజేపీ, దాని వెనకున్న ఆర్ఎస్ఎస్ రెండూ కూడా రిజర్వేషన్ వ్యవస్థను వ్యతిరేకిస్తున్నాయని, ఒకవేళ బీజేపీ గెలిచి మళ్ళీ మోడీ ప్రధాని అయితే దేశంలో రిజర్వేషన్ వ్యవస్థను చేస్తారని వాదిస్తున్నాయి. కాంగ్రెస్ చేస్తున్న ఈ వాదనలతో బీజేపీకి తెలంగాణలో మాత్రమే కాక ఇతర రాష్ట్రాలలో కూడా నష్టపోయే ప్రమాదం ఉంటుంది.
ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ స్పందిస్తూ కాంగ్రెస్ మంత్రులు దుష్ప్రచారం చేస్తున్నారు. మేము రిజర్వేషన్ వ్యవస్థకు వ్యతిరేకం కాదు. దేశంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగే అంతవరకు అందరూ తమ కాళ్లపై తాము నిలబడేవరకు రిజర్వేషన్లుఅవసరమే అని మేము భావిస్తున్నాము. కానీ కొందరు నేతలు మేము రిజర్వేషన్లకు వ్యతిరేకమని దుష్ప్రచారం చేస్తున్నారు,” అని ఆర్ఎస్ఎస్, బీజేపీల వైఖరిని మోహన్ భగవత్ స్పష్టం చేశారు.