భారత్లో అతి పొడవైన తీగల వంతెన (కేబిల్ బ్రిడ్జ్)ని ప్రధాని నరేంద్రమోడీ నేడు ప్రారంభోత్సవం చేశారు. మోడీ స్వరాష్ట్రమైన గుజరాత్లోని ఓఖా- ద్వారక పట్టణాలను కలుపుతూ తీగల వంతెనను రూ.979 కోట్లు వ్యయంతో నిర్మించారు. దీనికి 2017 అక్టోబరులో మోడీ శంకుస్థాపన చేయగా నేటికీ నిర్మాణ పనులన్నీ పూర్తిచేసుకొని ప్రజలకు అందుబాటులోకి వచ్చింది.
దీనికి ‘సుదర్శన్ సేతు’ అని నామకరణం చేశారు. ఈ వంతెన పొడవు 2.3 కిమీ, వెడల్పు 27.20 మీటర్లు. వాహనాల కోసం నాలుగు లేన్లతో నిర్మించిన ఈ తీగల వంతెనపై పాదాచారులు నడిచివెళ్ళేందుకు వీలుగా ఇరువైపులా 2.5 మీటర్లు వెడల్పుతో ఫుట్పాత్లు కూడా నిర్మించారు. వంతెన పొడవునా భగవత్ గీత శ్లోకాలు, శ్రీకృష్ణుడు చిత్రాలను అమర్చారు.
భారీ భూకంపాలను కూడా తట్టుకొని మరో 100-200 ఏళ్ళు ధృడంగా నిలబడేలా దీనిని అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించారు.
గుజరాత్, పంజాబ్, యూపీ, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో రూ.6,300 కోట్లు వ్యయంతో కొత్తగా నిర్మించిన ఎయిమ్స్ ఆస్పత్రులను కూడా నేడు ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభోత్సవాలు చేశారు.
#WATCH | Gujarat: Prime Minister Narendra Modi inaugurates Sudarshan Setu, country’s longest cable-stayed bridge of around 2.32 km, connecting Okha mainland and Beyt Dwarka. pic.twitter.com/4OpY0ekCDH
— ANI (@ANI) February 25, 2024