నటుడు ప్రకాష్ రాజ్ మళ్ళీ ట్వీటేశారు. ఈసారి జనసేన ఎమ్మెల్సీ నాగబాబు ట్వీట్కి బదులుగా ట్వీట్ వేశారు.
ఇంతకీ నాగబాబు ఏమని ట్వీట్ చేశారంటే, “నాయకుడు మాటే ఫైనల్. ఆ దారిలో ఎన్ని దెయ్యాలు, రాక్షసులు ఉన్నాయో ఎవరూ చూడలేదు. కనుక ఏది మంచి ఏది చెడు అనేది ఆయనకు మాత్రమే తెలుసు. కనుక అందరూ మీ అనుమానాలు కట్టిబెట్టి, నోరు మూసుకొని ఎటువంటి ప్రశ్నలు అడగకుండా నాయకుడిని అనుసరించండి,” అంటూ పవన్ కళ్యాణ్ ఫోటోతో ప్రజల నాయకుడు అని నాగబాబు ట్వీట్ చేశారు.
దీనిపై ప్రకాష్ రాజ్ స్పందిస్తూ, “అనుమానాలు మానుకొని, నోరు మూసుకొని నాయకుడిని ప్రశ్నించకుండా అనుసరించమని చెప్పడంలో మీ ఉద్దేశ్యం ఏమిటి? మేము గొర్రెలం కాము బానిస బ్రతుకు బ్రతకడానికి. నాగబాబుగారు ఈ బెదిరింపులు వద్దు. ప్రశ్నించడం మా హక్కు. ఏ నాయకుడినైనా... నేనే నాయకుడిని అనుకున్నవాడైనా సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. అర్థం అయ్యిందా? #జస్ట్ ఆస్కింగ్” అని ట్వీట్ చేశారు.