 
                                        రష్మిక మందన, దీక్షిత్ శెట్టి జంటగా చేసిన ‘ది గర్ల్ ఫ్రెండ్’ నుంచి ముచ్చటగా మూడో పాట శుక్రవారం సాయంత్రం 4.05 గంటలకు విడుదల కాబోతోంది. ముందుగా నేడు ఈ పాట ప్రమో విడుదల చేశారు. ‘లాయ్ లాయ్ లే...’ అంటూ సాగే ఈ పాటని రాకేందు మౌళి వ్రాయగా హేషమ్ అబ్దుల్ వాహబ్ స్వరపరిచి, సంగీతం అందించారు. ఈ పాటని కపిల్ కపిలన్ అద్భుతంగా పాడారు.
ఈ సినిమాకు కధ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, దర్శకత్వం: రాహుల్ రవీంద్రన్, సంగీతం: హేషమ్ అబ్దుల్ వాహబ్, కెమెరా: కృష్ణన్ వసంత్, ఎడిటింగ్: చోట కే ప్రసాద్ చేశారు.
గీతా ఆర్ట్స్ బ్యానర్పై విద్యా కొప్పినీడి, ధీరజ్ మొగిలినేని కలిసి ఈ సినిమాని తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషలలొ పాన్ ఇండియా మూవీగా నిర్మించిన ఈ సినిమా నవంబర్ 7న విడుదల కాబోతోంది.