ఎస్ఎస్ఎంబీ29 వర్కింగ్ టైటిల్తో రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా చేస్తున్న సినిమా షూటింగ్ ఈ ఏడాది జూలైలో మొదలైంది. అప్పటి నుంచి ఈ సినిమా గురించి మీడియాలో వస్తున్న వార్తలే తప్ప రాజమౌళి స్వయంగా ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు.
ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామరూన్ వచ్చే నెలలో అవతార్-3 ప్రమోషన్స్ కోసం భారత్కి రానున్నారు. కనుక నవంబర్ 11 లేదా 15వ తేదీన హైదరాబాద్లో అట్టహాసంగా ఓ కార్యక్రమం నిర్వహించి దానిలో ఆయన చేత ఈ సినిమా టైటిల్, పోస్టర్ విడుదల చేయాలని రాజమౌళి నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలోనే ఎస్ఎస్ఎంబీ29 ఫస్ట్ గ్లిమ్స్ వీడియో కూడా విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం.
దుర్గా ఆర్ట్స్ పతాకంపై కేఎల్ నారాయణ నిర్మిస్తున్న ఎస్ఎస్ఎంబీ29లో పృధ్వీరాజ్ సుకుమారన్, మాధవన్, ప్రియాంకా చోప్రా తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాకు ‘వారణాసి’ అనే పేరు ఖరారు చేసినట్లు సమాచారం.