కన్నప్ప, కుబేర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ రద్దు

June 13, 2025


img

అహ్మదాబాద్‌ విమాన దుర్గటనలో విమానం ఉన్న 12 మంది సిబ్బందితో సహా 229 మంది ప్రయాణికులు చనిపోయారు. విమానం రన్ వే అవతల ఉన్న మెడికల్ కాలేజ్ హాస్టల్‌పై కూలిపోవడంతో, 24 మంది వైద్య విద్యార్ధులు చనిపోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

ఈ ఘోర ప్రమాదంలో బ్రిటన్ పౌరసత్వం కలిగిన విశ్వాస కుమార్‌ రమేష్ (సీట్ నంబర్: 11) అనే ఒకే ఒక వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. కానీ అదే విమానంలో వేరే సీట్లో కూర్చున్న తన సోదరుడుతో సహా ప్రయాణికులు అందరూ చనిపోవడం తనకు చాలా ఆవేదన కలిగిందని రమేష్ అన్నారు. 

ఈ విమాన ప్రమాదంలో పలువురు చనిపోవడంతో, శుక్రవారం హైదరాబాద్‌లో జరగాల్సిన కన్నప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్‌, మద్యప్రదేశ్, ఇండోర్‌లో జరగాల్సిన కన్నప్ప ఈవెంట్‌ రెండు రద్దు అయ్యాయి. కుబేరా ఈ నెల 20న, కన్నప్ప ఈ నెల 27న విడుదల కాబోతున్నాయి.


Related Post

సినిమా స‌మీక్ష