‘విరూపాక్ష’తో కార్తీక్ దండు ప్రేక్షకులను మెప్పించగా, ‘తండేల్’ సినిమాతో నాగ చైతన్య ప్రేక్షకులను మెప్పించి తొలిసారిగా వంద కోట్ల క్లబ్లో అక్కినేని కుటుంబాన్ని చేర్చారు. కనుక వారిద్దరి కాంబినేషన్లో సినిమా ప్రకటించగానే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ఈ సినిమా ప్రీ-లుక్ పోస్టర్లో ఓ జంతువు కన్ను... దాని కంటి ప్రతిబింబంలో నాగ చైతన్య ఓ కొండ గుహలో నిలబడినట్లు చూపారు. అంటే ఇదో సాహసయాత్ర సినిమా అని చెప్పేశారు. ఈ జోనర్లో నాగ చైతన్య సినిమా చేయడం ఇదే మొదటిసారి కనుక ఈ సినిమాకి ప్లస్ పాయింట్ అవుతుంది.
ఈ సినిమాకి ‘వృష ఖర్మ’ అని టైటిల్ ఖరారు చేసినట్లు సోషల్ మీడియాలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ ఇంకా ఖరారు చేయవలసి ఉంది. నాగ చైతన్య, మీనాక్షి చౌదరి జంటగా నటిస్తున్న ఈ సినిమాని బీవీఎన్ ప్రసాద్, సుకుమార్ రైటింగ్స్ కలిసి నిర్మిస్తున్నారు.