నితిన్- వెంకీ కుడుమల కాంబినేషన్లో ‘రాబిన్ హుడ్’భారీ అంచనాలతో మార్చి 28 న విడుదలైంది. కానీ నిరాశ పరిచింది. దీని తర్వాత ‘తమ్ముడు’ సినిమా రిలీజ్ చేసేందుకు నిర్మాత దిల్రాజు ప్లాన్ చేస్తున్నారు. నిజానికి ఈ సినిమా ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేయాలనుకున్నారు.
కానీ రాబిన్ హుడ్ కోసం వాయిదా వేసుకున్నారు. కనుక ఇప్పుడు జూలై 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు ‘తమ్ముడు’ని తీసుకురావాలని దిల్రాజు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
పవన్ కళ్యాణ్కి ‘వకీల్ సాబ్’ వంటి సూపర్ హిట్ అందించిన శ్రీరామ్ వేణు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండటంతో దీనిపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. దీని తర్వాత వేణు ఎల్దండి దర్శకత్వంలో నితిన్ చేయబోతున్న ఎల్లమ్మ సినిమాకు దిల్రాజే నిర్మాత.
కనుక ‘తమ్ముడు’ ప్రభావం నితిన్, దిల్రాజు ఇద్దరిపై చాలా ఉంటుంది. అది హిట్ అయితే పరవాలేదు కానీ ఫ్లాప్ అయితే ఇద్దరికీ ఇబ్బందిగానే ఉంటుంది.
తమ్ముడుకి బి. అజనీష్ లోక్నాధ్ సంగీతం, కేవీ గుహన్ సినిమాటోగ్రఫీ చేస్తున్నారు.